పిల్లల చదువు ఖర్చుపై ఆందోళన లేదు | Sakshi
Sakshi News home page

పిల్లల చదువు ఖర్చుపై ఆందోళన లేదు

Published Mon, Nov 20 2023 2:04 AM

- - Sakshi

నేను, నా భర్త గని పనులు చేస్తూ బతుకుతున్నాం. మాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ అవుకు ఆదర్శ పాఠశాలలో చదువుతున్నారు. మాలాంటి పేదోళ్లం పిల్లలను చదివించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో చదువుల భారం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకుంటున్నారు. పైసా ఖర్చు లేకుండా చదివించుకుంటున్నాం. అమ్మఒడి పథకం వస్తుంది. జగనన్న విద్యా కానుక కింద పుస్తకాలు, బ్యాగ్‌లు, బూట్లు ఇచ్చారు. మధ్యాహ్నం భోజనంలో పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆయన పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో మార్పు వచ్చాయి. ప్రైవేటు పాఠశాలలకంటే సదుపాయాలు బాగున్నాయి. పేదోళ్లకు జగనన్న ఎంతో చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ జనం మళ్లీ జగన్ననే గెలిపిస్తారు. – రమణమ్మ, చెర్లోపల్లె గ్రామం, అవుకు మండలం

Advertisement
Advertisement