29న జిల్లాకు సీఎం వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

29న జిల్లాకు సీఎం వైఎస్‌ జగన్‌

Published Fri, Nov 24 2023 1:48 AM

- - Sakshi

కల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 29న కర్నూలు జిల్లాకు రానున్నారు. పాణ్యం నియోజవర్గంలో జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన కోసం గురువారం జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్‌ , జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్‌ కమిషనర్‌ భార్గవ్‌ తేజ ఓర్వకల్లు మండలం నన్నూరు, కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామాల్లో స్థలాలను పరిశీలించారు. హెలిపాడ్‌, సభాస్థలం, పార్కింగ్‌ ప్రదేశాలు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు. అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కర్నూలు ఎస్పీ జి.కృష్ణకాంత్‌, జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ హరిప్రసాద్‌, కర్నూలు డీఎస్పీ విజయ శేఖర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐలు ప్రసాద్‌, శ్రీనివాసరెడ్డి, నాగరాజు యాదవ్‌, కర్నూలు రూరల్‌ సర్కిల్‌ సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

స్థలాలను పరిశీలించిన ఎస్పీ

Advertisement
Advertisement