బడుగు, బలహీన వర్గాల వారికి పదవులు ఇచ్చి వైఎస్సార్సీపీ సముచిత స్థానం కల్పించింది. టీడీపీ ఆయా వర్గాలకు ఎన్నికల ముందు కొన్ని తాయిలాలు ప్రకటించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది. వెనుకబడిన వర్గాల ప్రజలందరూ వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలవాలి. భారీగా తరలివచ్చి సామాజిక సాధికార బస్సుయాత్రను విజయవంతం చేయాలి. వైఎస్సార్సీపీ పాలనకు, గత టీడీపీ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. మంచి చేసే వారి పక్షాన నిలవండి. – ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
వైఎస్సార్సీపీ పాలనలోనే
సామాజిక న్యాయం
రాష్ట్రంలో అన్ని వర్గాలకు వైఎస్సార్సీపీ పాలనలోనే న్యాయం జరిగింది. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ ఏనాడు బీసీలకు అండగా నిలిచింది లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగానే టీడీపీ చూసింది. సీఎం జగన్ మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. – టంగుటూరి గౌరీదేవి,
మేదరి కార్పొరేషన్ డైరెక్టర్, మహానంది