ఇన్‌పుట్‌ సబ్సిడీ నివేదికలపై కసరత్తు | Sakshi
Sakshi News home page

ఇన్‌పుట్‌ సబ్సిడీ నివేదికలపై కసరత్తు

Published Wed, Nov 29 2023 2:00 AM

-

కర్నూలు(అగ్రికల్చర్‌): కరువు మండలాల్లో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేసేందుకు నివేదికలు తయారు చేయడంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు నిమగ్నమై ఉన్నారు. సవరించిన స్టేట్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌పండ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతుల పేర్లు, ఆధార్‌, బ్యాంకు ఖాతా తదితర పూర్తి వివరాలతో ఈ నెల 29వ తేదీ సాయంత్రానికి నివేదికలు పంపాల్సి ఉంది. మంగళవారం సాయంత్రం నాటి కి 10 మండలాల నుంచి పూర్తి స్థాయి నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని కరువు మండలాల నుంచి వచ్చిన నివేదికలను బుధవారం జిల్లా స్థాయిలో క్రోడికరించి కలెక్టర్‌ డాక్టర్‌ జి. సృజన ద్వారా ప్రభుత్వానికి పంపాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement