పట్టుదలతో చదివి.. విజయం సాధించి | Sakshi
Sakshi News home page

పట్టుదలతో చదివి.. విజయం సాధించి

Published Sat, Dec 23 2023 5:02 AM

తల్లిదండ్రులతో కోగిల చెన్నయ్య 
 - Sakshi

బనగానపల్లె రూరల్‌: పట్టుదలతో చదివి ఎస్‌ఐ ఫలితాల్లో కై ప గ్రామానికి చెందిన కోగిల చెన్నయ్య విజయం సాధించాడు. కోగిల మోహన్‌దాసు, జయమ్మ దంపతుల కుమారుడైన చెన్నయ్య బనగానపల్లెలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2014లో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాడు. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో టెలికం అసిస్టెంట్‌ ఉద్యోగం చేస్తూనే ఎస్‌ఐ పరీక్షలకు సిద్ధమయ్యాడు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించాడు. తన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ.. తనను చదివించారని, పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేస్తానని కోగిల చెన్నయ్య తెలిపారు.

Advertisement
Advertisement