ప్యాపిలిలో టీడీపీకి భారీ షాక్‌ | Sakshi
Sakshi News home page

ప్యాపిలిలో టీడీపీకి భారీ షాక్‌

Published Sat, Apr 20 2024 1:20 AM

- - Sakshi

ప్యాపిలి: మండలంలో అసలే అంతంతమాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి క్యాడర్‌ దూరమవుతుండటంతో కుదేలవుతోంది. వరుస షాకులతో ఆ పార్టీ నేతలు, నియోజకవర్గ నాయకులు నిశ్చేష్టులై చూస్తు న్నారు. శుక్రవారం ప్రచారం నిమిత్తం ప్యాపిలికి వచ్చిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సమక్షంలో ఏకంగా టీడీపీకి మద్దుతు ఇస్తున్న 500 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఇటీవల టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిన పోతిరెడ్డి వెంకటేశ్వర్‌ రెడ్డి, రజనీ రెడ్డి, భూశెట్టి చిన్న సుంకయ్య ఆధ్వర్యంలో ప్యాపిలి, కలచట్ల, ఎస్‌.రంగాపురం, ఎర్రగుంట్లపల్లి తదితర గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పార్టీలో చేరిన వారికి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కలచట్ల నుంచి రమేశ్‌, రామాంజి, నాగేశ్వరరావు తదితరులతో పాటు 200 కుటుంబాలు, ప్యాపిలి నుంచి ముక్కెల్ల వెంకటరాముడు, కమలాకర్‌, గణేశ్‌, మహేశ్‌, తరుణ్‌, భాస్కర్‌, శంకర్‌, వెంకటేశ్‌ తదితరులతో పాటు 100 కుటుంబాలు, 50 మంది మహిళలు, కలచట్ల, ఎస్‌.రంగాపురం, ఎర్రగుంట్లపల్లి తదితర గ్రామాల నుంచి తులసిరెడ్డి, రంగమునిరెడ్డి, రాజేశ్వర్‌ రెడ్డి తదితరులతో పాటు 150 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలోకి చేరిన నాయకులు, కార్యకర్తలకు ఎళ్లవేళలా అండగా ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలు మాట్లాడుతూ ప్యాపిలి మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైఎస్సార్‌సీపీలోకి చేరినట్లు తెలిపారు. పార్టీలకతీతంగా జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి పార్టీ మారినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా పని చేస్తామని వారు స్పష్టం చేశారు.

టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన 500 కుటుంబాలు

Advertisement
Advertisement