ఊకచెట్టువాగుపై చెక్‌డ్యాం పరిశీలన | Sakshi
Sakshi News home page

ఊకచెట్టువాగుపై చెక్‌డ్యాం పరిశీలన

Published Thu, Nov 9 2023 1:22 AM

చెక్‌డ్యాంను పరిశీలిస్తున్న అధికారులు  - Sakshi

చిన్నచింతకుంట: మండలంలోని ఊకచెట్టు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంను బుధవారం ఇరిగేషన్‌ శాఖ ఈఈ ప్రతాప్‌సింగ్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ స్వామి తదితరులు పరిశీలించారు. ఈ చెక్‌డ్యాం నిర్మాణంతో చిన్నచింతకుంట గ్రామ ప్రజలకు రాకపోకల సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే చెక్‌డ్యాంను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 2న కురుమూర్తిస్వామి ఆలయం వద్దకు వచ్చిన కలెక్టర్‌ రవినాయక్‌కు పలువురు ఫిర్యాదులు అందజేశారు. ఈ విషయమై కలెక్టర్‌ ఆదేశాల మేరకు వారు చెక్‌డ్యాంను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని, కలెక్టర్‌ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వారు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణయ్య, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement