Sakshi News home page

నామినేషన్ల పరిశీలనపారదర్శకంగా జరగాలి

Published Sun, Nov 12 2023 12:50 AM

ఆర్డీఓ కార్యాలయంలో సూచనలు చేస్తున్న కలెక్టర్‌ శ్రీహర్ష   - Sakshi

నారాయణపేట రూరల్‌: జిల్లాలోని మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లో దాఖలైన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పారదర్శరంగా జరగాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. ఆయా పట్టణాల్లోని రిటర్నింగ్‌ కార్యాలయాలను శనివారం ఆయన స్వయంగా పరిశీలించి అడిషనల్‌ కలెక్టర్‌ మయాంక్‌మిత్తల్‌, ఆర్డీఓ రాంచందర్‌లతో మాట్లాడారు. నామినేషన్ల పరిశీలనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం పూర్తి స్థాయి అవగాహనతో పరిశీలించాలన్నారు. నిబంధనల ప్రకారం స్క్రూటినీ జరగాలని, తప్పులకు ఆస్కారం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ వెనక అడీషనల్‌ కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement