Sakshi News home page

ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలి

Published Thu, Nov 16 2023 1:12 AM

- - Sakshi

కోస్గి: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని ఏఎస్పీ నాగేంద్రుడు సూచించారు. బుధవారం కోస్గి పట్టణంలో పోలీసులు, కేంద్ర ప్రత్యేక బలగాలతో ప్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోలీసు శాఖ ప్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తుందని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం కల్పించడంతోపాటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే పోలీసు శాఖ లక్ష్యంగా ఇలాంటి ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు పట్టణంలో ప్రత్యేక పోలీస్‌ బలగాలతో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ జనార్దన్‌ గౌడ్‌, ఎస్సైలు శ్రీనివాసులు, నరేష్‌తోపాటు ఆర్‌ఎఎఫ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement