కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు | Sakshi
Sakshi News home page

కురుమూర్తి జాతరకు ప్రత్యేక బస్సులు

Published Fri, Nov 17 2023 1:12 AM

- - Sakshi

వనపర్తిటౌన్‌: కురుమూర్తిస్వామి జాతర పురస్కరించుకొని ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు వనపర్తి డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్‌ వేణుగోపాల్‌ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని డిపో పరిధిలో ప్రత్యేక బస్సుల స్టిక్కర్లను విడుదల చేసి మాట్లాడారు. వనపర్తి డిపో నుంచి కొత్తకోట మీదుగా ఆలయం వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. 18న 5 బస్సులు, ఆదివారం ఉద్దాల రోజు రద్దీకి అనుగుణంగా 15 నిమిషాలకు ఒకటి చొప్పున నడపనున్నట్లు చెప్పారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ దేవేందర్‌గౌడ్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement