బీజేపీ కదం | Sakshi
Sakshi News home page

బీజేపీ కదం

Published Fri, Nov 17 2023 1:12 AM

- - Sakshi

మ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌, గద్వాల, నారాయణపేట, మక్తల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాలపై బీజేపీ ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. అక్టోబర్‌ 1న మహబూబ్‌నగర్‌లో పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్‌కర్నూల్‌ సభకు హాజరయ్యారు. షెడ్యూల్‌ ప్రకటన తర్వాత ఆ పార్టీ ముఖ్య నేతలు కిషన్‌రెడ్డి, ఈటల, బండితో పాటు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరచుగా జిల్లాలో పర్యటిస్తూ తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గద్వాలకు రానున్నారు. బండి సంజయ్‌ సైతం మహబూబ్‌నగర్‌కు రానుండగా ఆ పార్టీలో ఉత్సాహం నెలకొంది.

Advertisement
Advertisement