రేపు కోస్గిలో కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ | Sakshi
Sakshi News home page

రేపు కోస్గిలో కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ

Published Tue, Nov 21 2023 12:34 AM

సభా స్థలంలో పార్టీ నాయకులతోమాట్లాడుతున్న మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి - Sakshi

కోస్గి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 22న బుధవారం కోస్గిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుంది. పట్టణ శివారులోని లక్ష్మీ నర్సింహా గార్డెన్‌ సమీపంలోని స్థలాన్ని సభకు ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం రాష్ట్ర గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో పార్టీ ఎన్నికల పరిశీలకులు బాబా ఫసియోద్దీన్‌, స్థానిక నాయకులతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్‌కు ఎంపిక చేసిన స్థలం, సభకు సంబందించిన ఏర్పాట్లపై సమీక్షించారు. సభకు వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఇందులో పార్టీ నాయకులు మ్యాకల రాజేష్‌, వెంకట్‌ నర్సిములు, వరప్రసాద్‌తోపాటు పలువురు నాయకులు ఉన్నారు.

Advertisement
Advertisement