జోగిని వ్యవస్థను రూపుమాపాలి | Sakshi
Sakshi News home page

జోగిని వ్యవస్థను రూపుమాపాలి

Published Tue, Nov 21 2023 12:34 AM

కురుమూర్తి జాతరలో ర్యాలీ నిర్వహిస్తున్న జోగినిలు - Sakshi

చిన్నచింతకుంట: సమాజంలో జోగిని వ్యవస్థను రూపుమాపాలని ఓఎంఐఎఫ్‌ ఆపరేషన్‌ మెర్సీ ఇండియా ఫౌండేషన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ హాజమ్మ అన్నారు. సోమవారం మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి జాతరలో జోగినిలతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూఢనమ్మకాలను నమ్మవద్దన్నారు. జోగిని వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషిచేయాలని కోరారు. బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, బాలికలను బడికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్‌, ఎల్లప్ప, లక్ష్మి, జయనిర్మల, జయమ్మ, స్వప్న, మహేశ్వరి పాల్గొన్నారు.

Advertisement
Advertisement