ముగిసిన ప్రచారం.. ఇక ప్రలోభాల పర్వం | Sakshi
Sakshi News home page

ముగిసిన ప్రచారం.. ఇక ప్రలోభాల పర్వం

Published Wed, Nov 29 2023 12:42 AM

- - Sakshi

బీజేపీ: అతిరథుల ‘పట్టు’

తెలంగాణలో పట్టు సాధించి, పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ అతిరథులు పోటెత్తారు. షెడ్యూల్‌ కంటే ముందుగానే ఉమ్మడి పాలమూరు నుంచే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావం పూరించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం మళ్లీ అగ్రనేతల రాక మొదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ, అసోం సీఎంలు యోగి ఆధిత్యనాథ్‌, హిమంత బిశ్వశర్మ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రులు మురళీధరన్‌, నారాయణస్వామి, భగవంత్‌ కుబ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌తోపాటు తరుణ్‌చుగ్‌, ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌, రాజాసింగ్‌ సంకల్స సభలు, రోడ్‌షోలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పాటు ఎంఐఎంపై విమర్శలు గుప్పించారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌, మక్తల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి నియోజకవర్గాలపై ఆ పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement