దేశంలో కొత్తగా 30,254 కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

దేశంలో కొత్తగా 30,254 కరోనా కేసులు

Published Sun, Dec 13 2020 10:14 AM

30254 New Coronavirus Cases Recorded In India - Sakshi

ఢిల్లీ : దేశంలో గత  24 గంటల్లో 30,254 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు చేరుకుందని కేంద్ర వైద్యారోగ్యశాఖతెలిపింది. కరోనా కారణంగా కొత్తగా 391 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,43,019కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కొత్తగా 33,196 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 93,57,464కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.93శాతానికి చేరింది. దేశంలో ప్రస్తుతం 3,56,546 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మరణాల రేటు 1.45 శాతంగా ఉంది

Advertisement
Advertisement