Bengaluru police seize fake currency notes, two Nigerians absconding - Sakshi
Sakshi News home page

Bengaluru: పెద్దమొత్తంలో భారత్, అమెరికా నకిలీ కరెన్సీ నోట్లు సీజ్‌ 

Published Thu, Dec 15 2022 12:40 PM

Bengaluru police seize fake currency notes - Sakshi

సాక్షి, బెంగళూరు: బెంగళూరులో అమెరికా డాలర్లు, భారత్‌ కరెన్సీ నకిలీ నోట్లు ముద్రిస్తున్న ఇంటిపై బెంగళూరు సీసీబీ పోలీసు­లు బుధవారం దాడి చేశారు. పెద్దమొత్తంలో నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నగర జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.­డి.శరణప్ప తెలిపిన వివరాల ప్రకారం... హెణ్ణూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక ఇంట్లో భారత్, అమెరికా నకిలీ కరెన్సీ ముద్రించి మార్కెట్లోకి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్న­ట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు ఆ ఇంటిపై దాడి చేశారు.

అయితే అప్పటికే ఇద్దరు నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు. ఇంట్లో గాలించగా భారత్‌కు చెంది­న రూ.500 నోట్లు 10,033, అమెరికాకు చెందిన వంద డాలర్ల నోట్లు 708 లభించాయి. అలాగే మరికొంత మొత్తంలో వెయ్యి రూపాయల పాత నోట్లు, ముద్రణకు వాడే రసాయ­నాల సీసాలు, నాలుగు కలర్‌ ప్రింటర్లు, ఇంక్‌జెట్‌ ఎల్రక్టానిక్‌ డైయింగ్‌ మెషిన్‌ తదితరాలు అక్కడ దొరికాయి. ఇప్పటివరకు ఎంత మొత్తంలో నోట్లను మార్కెట్లోకి వదిలారన్నది తేలాల్సి ఉంది.  

చదవండి: (మద్యం మత్తులో యువతి హల్‌చల్‌.. బీర్‌బాటిల్‌తో దాడి.. ఏఎస్సైకి తీవ్రగాయాలు)

Advertisement
Advertisement