Sakshi News home page

అమానవీయ ఘటన.. దళితునితో చెప్పులు నాకించి..

Published Sun, Jul 9 2023 9:31 AM

Dalit Man Slapped Forced To Lick Slipper In Uttar Pradesh - Sakshi

లక్నో: మధ్యప్రదేశ్‌లో గిరిజన వ్యక్తిపై యూరినేషన్ సంఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి దళిత యువకునితో చెప్పులు నాకించాడు. అనంతరం బాధితున్ని కుంజీలు తీయించాడు. అతనిపై పరుష పదజాలంతో బూతులు తిడుతూ దాడి చేశాడు. ఈ ఘటన సోనభద్ర జిల్లాలో వెలుగులోకి రాగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితున్ని అరెస్టు చేశారు.

దళిత వ్యక్తి తన మామయ్య ఇంట్లో ఎలక్ట‍్రిసిటీ సమస్య కారణంగా లైన్‌మెన్‌ తేజ్‌బలి సింగ్‌ని ఇంటికి పిలిచారు. ఈ అంశంలో వివాదం రాగా.. తేజ్‌బలి సింగ్ రెచ్చిపోయాడు. దళిత వ్యక్తితో చెప్పులు నాకించాడు. కుంజీలు తీయించాడు. ఆ తర్వాత అతనిపై దాడి చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. నెటిజన‍్లు ఫైరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: మధ్యప్రదేశ్‌లో మరో వికృత చేష్ట.. వీడియో వైరల్‌

Advertisement

What’s your opinion

Advertisement