Delhi excise policy case: కేజ్రీవాల్‌కు ఊరట | Sakshi
Sakshi News home page

Delhi excise policy case: కేజ్రీవాల్‌కు ఊరట

Published Sun, Mar 17 2024 4:52 AM

Delhi excise policy case: CM Arvind Kejriwal granted bail in ED cases for skipping summons - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. మద్యం విధానం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌ ఆరోపణలపై విచారణకు రావాలంటూ పంపిన సమన్లకు కేజ్రీవాల్‌ స్పందించనందున ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఈడీ కోర్టులో రెండుసార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అయితే, మొదటి ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేజ్రీవాల్‌ శనివారం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ రెండో ఫిర్యాదుపై మేజిస్ట్రేట్‌ కోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదు పత్రాలను కేజ్రీవాల్‌కు అందజేయాలని ఈడీని ఆదేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement