మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఒక వైద్యుడు ఆన్లైన్లో సమోసాలు ఆర్డర్ చేసి మోసపోయారు. 25 ప్లేట్ల సమోసాలు ఆర్డర్ చేసి, రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ ఉదంతం సాయన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కేఈఎం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న 27 ఏళ్ల వైద్యుడు తనకు ఎదురైన మోసంపై బోయివాలా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
స్నేహితులతో పిక్నిక్ ప్లాన్
మోసపోయిన వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఆయన ఇటీవల ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆన్లైన్లో సమోసాలను ఆర్డర్ చేశారు. అయితే అప్పుడు తాను 25 ప్లేట్ల సమోసాల కోసం రూ.1.40 లక్షలు కోల్పోతానని గ్రహించలేకపోయారు. ఆయన తన స్నేహితులతో పాటు పిక్నిక్కు ప్లాన్ చేసుకున్నారు.
‘గురుకృప’కు ఫోన్ చేసి..
ఈ నేపధ్యంలో ప్రయాణంలో తినేందుకు ఏదైనా ఉండాలని భావించి, సమోసాలు ఆర్డర్ చేశారు. ఆయన గురుకృప రెస్టారెంట్కు ఫోన్ చేసి, 25 ప్లేట్ల సమోసాలను ఆర్డర్ చేశారు. ఇందుకోసం రూ.1500 పేమెంట్ చేయాలంటూ అటువైపు వారు సమాధానమిచ్చారు.
పేమెంట్ అందలేదంటూ..
వారు చెప్పిన నంబరుకు డాక్టర్ రూ.1500 ట్రాన్స్ఫర్ చేశారు. కొదిసేపటి తరువాత ఆ వైద్యునికి తిరిగిఫోన్ వచ్చింది. వారు తమకు పేమెంట్ అందలేదని, మరో నంబరుకు పేమెంట్ చేయాలంటూ ఆ నంబర్ తెలిపారు. అలాగేవారు పేమెంట్ రిక్వస్ట్ లింక్ కూడా పంపారు. వెంటనే డాక్టర్ ఆ లింక్ ద్వారా పేమెంట్ చేశారు. ఇది జరిగిన కొద్ది నిముషాలకు డాక్టర్ ఖాతా నుంచి రూ.28 వేలు కట్ అయ్యాయి.
బ్యాంక్ ఖాతా బ్లాక్ చేయించి..
ఇది చూసిన డాక్టర్ కంగుతిన్నారు. కొద్దిసేపటికి తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు మూడు సార్లు మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన వైద్యుడు బ్యాంకుకు ఫోన్ చేసి బ్లాక్ చేయించారు. అయితే అప్పటికే ఆయన ఖాతాలోని రూ.1.40 లక్షలను మోసగాళ్లు స్వాహాచేశారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: ఎంతటి సంపన్నుడయినా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మేనా? నమ్మితే అంతే!
Mumbai Doctor Viral Incident: డాక్టర్కు షాకిచ్చిన సమోసాలు.. రూ.1.40 లక్షలకు టోకరా!
Published Tue, Jul 11 2023 9:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement