విషాదం: సెప్టిక్‌ ట్యాంక్‌లో పడి ఐదుగురు మృతి‌ | Sakshi
Sakshi News home page

అన్నదమ్ములను బలి తీసుకున్న సెప్టిక్‌ ట్యాంక్‌‌

Published Wed, Mar 17 2021 10:18 AM

Five Drown In Septic Tank In Agra 4 Were Trying to Save 10 Year Old Boy - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌లో పడిన చిన్నారిని కాపడటం కోసం ప్రయత్నించిన మరో నలుగురు కూడా మరణించారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వివరాలు.. ఆగ్రా ఫతేహాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రతాపూర్‌ గ్రామానికి చెందిన పదేళ్ల చిన్నారి అనురాగ్‌ ఇంటి సమీపంలో ఆడుకుంటూ వెళ్లి సెప్టిక్‌ ట్యాంక్‌లో పడ్డాడు. బాలుడిని కాపాడటం కోసం వెళ్లిన మరో నలుగురు కూడా మరణించారు.

సోము, రామ్‌ ఖిలాడి, హరిమోన్‌(16), అవినాశ్‌(12) చిన్నారి అనురాగ్‌ని కాపడటం కోసం ప్రయత్నించి మృత్యువాత పడ్డారు. వీరిలో అవినాశ్‌, అనురాగ్‌, హరిమోన్‌ ముగ్గురు సోదరులు. గ్రామస్తులు వీరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వీరంతా మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మరణించిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. 

చదవండి:

నాన్‌వెజ్‌ పిజ్జా ఇస్తావా? రూ.కోటి ఇవ్వాల్సిందే‌

Advertisement
Advertisement