న్యూఢిల్లీ: భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. మూడు లక్షలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గినా.. కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 2,63,533 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 4,329 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం 4,22,436 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్రావైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దీని ప్రకారం మొత్తం 2,52,28,996 మంది కరోనా బారినపడ్డారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 2,78,719 మంది మృతిచెందారు. 2,15,96,512 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 33,53,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 18.44 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. గత 24 గంటల్లో 18,69,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 31,82,92,881 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
చదవండి: కవలల విషాదం: అమ్మా నువ్వేదో దాస్తున్నావ్ చెప్పు.. అంతలోనే