వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌ | Sakshi
Sakshi News home page

వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌

Published Tue, Sep 29 2020 10:14 PM

India Vice President Venkaiah Naidu Tested Coronavirus Positive - Sakshi

ఢిల్లీ : భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. కాగా వెంకయ్య నాయుడు కుటుంబసభ్యులకు కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. కాగా వెంకయ్యనాయుడు ఈ మధ్యనే రొటీన్‌గా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు.

ఈ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. వెంకయ్యనాయుడు సతీమణి ఉషా నాయుడుకు కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు' అని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది.

Advertisement
Advertisement