Election Commission: హోర్డింగులు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్‌ పేర్లు ముద్రించాల్సిందే | Sakshi
Sakshi News home page

Election Commission: హోర్డింగులు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్‌ పేర్లు ముద్రించాల్సిందే

Published Thu, Apr 11 2024 6:13 AM

Lok sabha elections 2024: EC orders crack down on anonymous political hoardings - Sakshi

రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం  

న్యూఢిల్లీ:  ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు నియమ నిబంధనలు కచి్చతంగా పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హోర్డింగులు సహా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే ఇతర సామగ్రిపై ప్రింటర్, పబ్లిషనర్‌ పేర్లు స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని ఆదేశించింది.

ఎన్నికల ప్రచారంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసమే ఈ నిబంధన విధించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన హోర్డింగులపై ప్రింటర్, పబ్లిషర్‌ పేర్లు లేవంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా పలువురు ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హోర్డింగుల సహా కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్‌ పేర్లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Advertisement
Advertisement