ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణ​యం.. 223 మంది మహిళా కమిషన్‌ ఉద్యోగులపై వేటు | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణ​యం.. 223 మంది మహిళా కమిషన్‌ ఉద్యోగులపై వేటు

Published Thu, May 2 2024 1:48 PM

Lt Governor removes several employees Delhi Women Panel

ఢిల్లీ:  ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) కీలక నిర్ణయం  తీసుకున్నారు.  ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను ఎల్జీ వీకే సక్సేనా తొలగించారు. ఈ మేరకు ఎల్జీ గురువారం ఉత్తర్వుల జారీ చేశారు. అమ్ ఆద్మీ పార్టీ ఎంపీ  స్వాతి మలివాల్.. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగులను నియమించినట్లు ఆరోపణలు రావటంతో ఎల్జీ ఈ నిర్ణయం  తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎల్జీ​ నిర్ణయంపై  స్పందించిన ఎంపీ స్వాతి మలివాల్‌ తీవ్రంగా ఖండించారు. ‘కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే.. మొత్తం కమిషన్‌ మూతపడుతుంది. కమిషన్‌ ప్యానెల్‌లో ప్రస్తుతం 90 మంది మాత్రమే ఉ‍న్నారు. అందుతో కేవలం 8 మంది మాత్రమే ప్రభుత్వ సిబ్బంది. మిగిలిన వారంతా మూడే నెలలపాటు పని చేసే.. కాంక్రాక్టు ఉద్యోగులు. ఇలా ఎందుకు చేస్తున్నారు. మహిళా  కమిషన్‌ అస్సలు మూత పడనివ్వను. నన్ను జైలులో పెట్టండి కానీ, మహిళలను హింసించకండి’అని  ‘ఎక్స్‌’ వేదికగా ఉన్నారు.

ఢిల్లీ మహిళా కమిషన్‌ చట్టం ప్రకారం ప్యానెల్‌లో 40 ఉద్యోగాలు, కొత్తగా కొల్పించిన 223 ఉద్యోగ పోస్టులకు ఎల్జీ అనుమంతి తీసుకోలేదని జారీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగులను నియమించే అధికారం కమిషన్‌కు లేదని తెలిపారు. స్వాతి మలివాల్ ఆప్‌ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కాకముందు 9 ఏళ్లు ఢిల్లీ మహిళా కమిషన్‌  చైర్మన్‌గా పనిచేవారు. ప్రస్తుతం ప్యానెల్‌  చైర్మన్ పదవి ఖాళీ ఉంది.  తాజా చర్యలతో మరోసారి ఆప్‌ ప్రభుత్వాని​కి,  ఎల్జీకి మరోసారి వివాదం ముదరనుందని ప్రచారం జరుగుతోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement