Sakshi News home page

మదర్సాలో 12 ఏళ్ల విద్యార్థినిపై టీచర్‌ వేధింపులు

Published Sun, Oct 9 2022 5:55 AM

Madrasa teacher molests 12-year-old student in Indore - Sakshi

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మదర్సాలో 12 ఏళ్ల విద్యార్థినిపై 52 ఏళ్ల ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చందన్‌నగర్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అభయ్‌ తెలిపారు. బాధితురాలి తండ్రి, చిన్నాన్నను కొట్టినందుకు ఉపాధ్యాయుడి ఇద్దరు కుమారులపై కేసు పెట్టినట్లు చెప్పారు.

బాధితురాలి కుటుంబం ఫిర్యాదు ప్రకారం.. బాలిక గత నెలలో మదర్సాలో చేరింది. పాఠాలు చెప్పే నెపంతో ఉపాధ్యాయుడు ఆమెను అసభ్యంగా తాకేవాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. నిలదీసేందుకు వెళ్లిన బాలిక తండ్రి, చిన్నాన్నను నిందితుడి కుమారులు కొట్టారు.

Advertisement
Advertisement