సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్న మరణాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో లాక్డౌన్ విధించాలని ప్రధాని మోదీపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అనుకూలంగా లేదని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని సగానికి పైగా జిల్లాల్లో కరోనా నియంత్రణలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా గతేడాది మాదిరిగా జాతీయస్థాయి లాక్డౌన్ విధించడం కారణంగా పేదలకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. అందుకే కొత్త కేసుల పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఆంక్షలతో కూడిన లాక్డౌన్ విధిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో పరిమిత లేదా పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. దీని ప్రభావం కనిపించడం ప్రారంభమైందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు... అక్కడ ఏ విధమైన ఆంక్షలు విధించారో ఓ సారి చూద్దాం.
మహారాష్ట్ర: ఏప్రిల్ 5న కర్ఫ్యూ లాంటి లాక్డౌన్, నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిషేదాజ్ఞలు మే 15 వరకు పొడిగించారు.
ఢిల్లీ: ఢిల్లీలో లాక్డౌన్ను 10వ తేదీ వరకు పొడిగించారు. ఏప్రిల్ 19 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతోంది.
ఉత్తర్ప్రదేశ్: ఉత్తర్ప్రదేశ్లో లాక్డౌన్ను మే 10 వరకు పొడిగించారు.
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లో లాక్డౌన్ను మే 15 వరకు పొడిగించారు. సంక్రమణ కొంత స్థాయిలో నియంత్రణలో ఉన్న రాయ్పూర్, దుర్గ్ జిల్లాల్లో కాలనీల్లోని కిరాణా దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. అయితే సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి. ఆదివారం పూర్తి లాక్డౌన్ ఉంటుంది.
బిహార్: పెరుగుతున్న పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని బిహార్ ప్రభుత్వం మే 15 వరకు లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని కార్యాలయాలు, దుకాణాలు, వాణిజ్య, ప్రైవేట్ సంస్థలు మూసివేయాలి. నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉదయం 7 నుండి 11 గంటల వరకు తెరిచి ఉంచుతారు.
ఒడిశా: ఒడిశాలో మే 19 వరకు లాక్డౌన్ విధించారు. ఒడిశాలో 15 రోజుల లాక్డౌన్ మే 19 వరకు ఒడిశాలో కొనసాగుతుంది.
పంజాబ్: మినీ లాక్డౌన్, వారాంతపు లాక్డౌన్ వంటి చర్యలతో పాటు, విస్తృతమైన ఆంక్షలు ఉన్నాయి. నైట్ కర్ఫ్యూ మే 15 వరకు అమలులో ఉంటుంది.
రాజస్థాన్: లాక్డౌన్ ఆంక్షలు మే 17 వరకు అమలులో ఉన్నాయి.
గుజరాత్: రాష్ట్రంలోని 29 పట్టణాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు నిషేధించారు.
మధ్యప్రదేశ్: కరోనా కర్ఫ్యూ మే 7 వరకు అమలులో ఉంది.
అస్సాం: నైట్ కర్ఫ్యూ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది. నైట్ కర్ఫ్యూ మే 7 వరకు అమలులో ఉంటుంది.
తమిళనాడు: మే 20 వరకు అన్ని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధంసహా విస్తృతమైన ఆంక్షలు విధించారు.
కేరళ: మే 9 వరకు లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు ఉన్నాయి.
కర్ణాటక: మే 12 వరకు లాక్డౌన్ కొనసాగుతోంది.
జార్ఖండ్: ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు లాక్డౌన్ అమలులో ఉంది.
గోవా: నాలుగు రోజుల లాక్డౌన్ సోమవారం ముగిసినప్పటికీ ఉత్తర గోవాలోని కలంగూట్, కాండోలిమ్ వంటి పర్యాటక ప్రదేశాలలో లాక్డౌన్ కొనసాగుతుంది. కోవిడ్ –19 కారణంగా ఆంక్షలు మే 10 వరకు కొనసాగుతాయి.
ఆంధ్రప్రదేశ్: మే 5వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రెండు వారాల పాటు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించారు.
తెలంగాణ: నైట్ కర్ఫ్యూ మే 8 వరకు కొనసాగుతుంది.
పుదుచ్చేరి: లాక్డౌన్ మే 10 వరకు పొడిగించారు.
నాగాలాండ్: మే 14 వరకు కఠినమైన నిబంధనలతో పాక్షిక లాక్డౌన్ విధించారు.
జమ్మూ కశ్మీర్: శ్రీనగర్, బారాముల్లా, బుద్గాం, జమ్మూ జిల్లాల్లో లాక్డౌన్ను మే 6 వరకు పొడగించారు. మొత్తం 20 జిల్లాల కార్పొరేషన్ / అర్బన్ లోకల్ బాడీస్ సరిహద్దులో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది.
జాతీయ స్థాయి లాక్డౌన్కు ప్రధాని మోదీపై ఒత్తిడి
Published Thu, May 6 2021 1:52 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు
భైంసా రోడ్షోలో ఉద్రిక్తత
ఎన్నికలకు సర్వం సిద్ధం
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
సమయం లేదు మిత్రమా..
● అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్.. ● రూ.2,500, తులం బంగారం ఇచ్చిండా.. ● రూ.2 లక్షల రుణమాఫీ చేసిండా.. ● తెలంగాణలో బీజేపీని అడ్డుకునేది బీఆర్ఎస్సే ● నిర్మల్ కార్నర్ మీటింగ్లో కేటీఆర్
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఫోన్ పోతే ఆందోళన వద్దు
ఆత్రం సుగుణను గెలిపించాలి
నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి
తప్పక చదవండి
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- ‘అద్భుతం కంటే తక్కువేం కాదు’.. కేజ్రీకు మద్యంతర బెయిల్పై
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement