మావోయిస్టు నేత మృతి | Sakshi
Sakshi News home page

మావోయిస్టు నేత మృతి

Published Fri, Feb 9 2024 6:25 AM

Maoist killed in encounter with security personnel in Chhattisgarh Dantewada district - Sakshi

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మూడు దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్‌ మావోయిస్టు నేత ఒకరు చనిపోయారు. అతడిని మావో డివిజినల్‌ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్‌ సత్యంగా గుర్తించారు.

సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గురువారం రాష్ట్ర పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బృందాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇతను మరణించారు. ఈయనపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామగ్రిని పోలీసులు స్వా«దీనం చేసుకున్నాయి.  

Advertisement
Advertisement