Secunderabad Ruby Hotel Fire Accident: PM Modi Condolences - Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ ‘రూబీ’ ప్రమాద ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి.. సాయం ప్రకటన

Published Tue, Sep 13 2022 8:42 AM

Secunderabad Ruby Hotel Accident: PM Modi Condolences - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో ఓ లాడ్జిలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సెల్లార్‌లో ఈ-బైకులు పేలి.. ఆ అగ్నిప్రమాదంతో అదే కాంప్లెక్స్‌లోని లాడ్జిలో బస చేసిన ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ.. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌(ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) తరపున రూ.2 లక్షలు, గాయపడిన వాళ్లకు రూ.50వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్విటర్‌లో ఓ ట్వీట్‌ చేసింది.

Advertisement
Advertisement