మహారాష్ట్రాలో అకోలా జిల్లాలోని ఆలయంలో పెను విషాదం చోటు చోటసుకుంది. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలులకు ఆలయంలోని ఓ భారీ వేప చెట్టు కూలి షెడ్పై పడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో సుమారు 30 మందిదాక తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అకోలా జిల్లాలో బాలాపూర్ తహసీల్లోని పరాస్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురవడంతో బాబూజీ మహారాజ్ దేవాలయంలోని షెడ్పై వేప చెట్టు పడటంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. జేసీబీ యంత్రాలతో విరిగిన చెట్టును, కూలిన షెడ్డు భాగాలను తొలగించి.. అందులో చిక్కుపోయిన వారిని రక్షించినట్లు తెలిపారు.