సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో విజేతగా నిలిచిన జిల్లా జట్టు | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో విజేతగా నిలిచిన జిల్లా జట్టు

Published Tue, Oct 17 2023 12:38 AM

విజేతగా నిలిచిన జిల్లా జట్టు క్రీడాకారులు - Sakshi

నిజామాబాద్‌నాగారం: రాష్ట్రస్థాయి సీనియర్‌ మహిళా సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌లో జిల్లా మహిళా జట్టు విజేతగా నిలిచింది. ఈనెల 15, 16వ తేదీల్లో హన్మకొండ కాకతీయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఫైనల్‌లో సిద్దిపేట జట్టుపై గెలిచి చాంపియన్‌షిప్‌ను జిల్లా జట్టు కై వసం చేసుకుంది. ఈ టోర్నీలో బెస్ట్‌ క్రీడాకారిణిగా జిల్లాకు చెందిన రాణిని రాష్ట్ర కార్యదర్శి నవీన్‌ జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఉపాధ్యక్షుడు శోభన్‌ బాబు క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. రాష్ట్ర జట్టుకు కోచ్‌ మేనేజర్‌గా వ్యవహరించిన నరేశ్‌, సంతోష్‌, గంగాధర్‌, సాయికిరణ్‌ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మర్కంటి గంగామోహన్‌, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ ముత్తన్న, సంగీత్‌రావు, నీరజారెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్‌, మధుసూదన్‌రెడ్డి, నరేందర్‌, జైపాల్‌రెడ్డి, మర్కంటి సుజాత, చిప్ప నవీన్‌, సూపరి వినోద్‌, జైడి రాజ్‌ కుమార్‌, బక్కురి పవన్‌, నాగమణి, నల్లూరి లత, ప్రేమలత, భూపతి, మధు, అనిల్‌, సురేశ్‌, స్వప్న, జ్యోత్స్న, మౌనిక పాల్గొన్నారు.

Advertisement
Advertisement