రూ.9.25లక్షల నగదు స్వాధీనం | Sakshi
Sakshi News home page

రూ.9.25లక్షల నగదు స్వాధీనం

Published Sat, Oct 28 2023 1:08 AM

- - Sakshi

బాన్సువాడ రూరల్‌: వాహనాల తనిఖీలో భాగంగా తాడ్కోల్‌ చౌరస్తాలో కారు నుంచి ఒకరి వద్ద రూ.9.25 లక్షల నగదు లభించినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. నసురుల్లాబాద్‌ మండలం అంకోల్‌క్యాంపునకు చెందిన మణిపృధ్వీ అనే సిమెంట్‌ షాపు నిర్వాహకుడి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఉన్నతాధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

వ్యభిచార గృహాలపై

పోలీసుల దాడి

ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని మూడోచోట్ల వ్యభిచార గృహాలపై దాడి నిర్వహించినట్లు సీఐలు అజయ్‌, అంజయ్య తెలిపారు. స్థానికుల ముందస్తు సమాచారం నిమిత్తం ఏక కాలంలో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించగా నిర్వాహకులతో పాటు ఐదుగురు విటులు, పది మంది బాధిత మహిళలను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement