అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి

Published Fri, Nov 10 2023 5:00 AM

నిజామాబాద్‌ ఆర్డీవో కార్యాలయం వద్ద కుటుంబసభ్యులు, నాయకులతో బాజిరెడ్డి గోవర్ధన్‌  - Sakshi

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): రూరల్‌ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రజలను కోరారు. నగరంలోని నిజామాబాద్‌ రూరల్‌ ఆర్డీవో కార్యాలయంలో గురువారం బాజిరెడ్డి గోవర్ధన్‌, కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా తరలివచ్చి మూడు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పదవి పవిత్రమైనదని, పదవిలో ఉన్నవారు హుందాగా ఉండాలన్నారు. ప్రజల సహకారంతో ఈసారి కూడా ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజా సేవకు పునరంకితం అవుతానని ధీమా వ్యక్తం చేశారు.

కుటుంబసభ్యులతో కలిసి యజ్ఞం..

నామినేషన్‌ వేయడానికి ముందుగా సారంగాపూర్‌ ఆంజనేయ ఆలయంలో స్వామివారిని బాజిరెడ్డి దర్శించుకున్నారు. నామినేషన్‌ పత్రాలను స్వామి వారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి యజ్ఞం నిర్వహించారు. బాజిరెడ్డి గోవర్ధన్‌ సతీమణి వినోద, జెడ్పీటీసీ జగన్‌, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌, నుడా చైర్మన్‌ ఈగ సంజీవరెడ్డి, న్యాయవాది ఈగ గంగారెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌ ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ రూరల్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

మూడు సెట్ల నామినేషన్‌ దాఖలు

ర్యాలీలో విజయసంకేతం చూపుతున్న ఎమ్మెల్యే
1/1

ర్యాలీలో విజయసంకేతం చూపుతున్న ఎమ్మెల్యే

Advertisement
Advertisement