మరోసారి దీవిస్తే మరింత అభివృద్ధి | Sakshi
Sakshi News home page

మరోసారి దీవిస్తే మరింత అభివృద్ధి

Published Sun, Nov 12 2023 12:34 AM

- - Sakshi

నిజామాబాద్‌నాగారం: అర్బన్‌ ఎమ్మెల్యేగా మరోసారి ఆశీర్వదిస్తే నిజామాబాద్‌ నగరాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా పేర్కొన్నారు. నగరంలోని 8, 27, 41, 42 డివిజన్లలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ.... నగరంలో 60ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 9ఏళ్లలో చేసి చూపించామన్నారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించామన్నారు. రైతుబీమా తరహాలో రూ.93లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ బీమా, రూ. 400లకే వంటగ్యాస్‌ సిలిండర్‌, ఆసరా పెన్షన్లు రూ.5000, దివ్యాంగులకు రూ.6000, అన్నపూర్ణ పథకం ద్వారా అందరికీ సన్న బియ్యం అందిస్తామన్నారు. మేయర్‌ నీతూకిరణ్‌, మాజీ మేయర్‌ ఆకుల సుజాత, మాజీ కార్పొరేటర్‌ చాంగుబాయి, పట్నం విక్రమ్‌గౌడ్‌, శ్రీను, రాజేంద్ర ప్రసాద్‌, విజయలక్ష్మి, షేక్‌ అహ్మద్‌, పూర్ణ, జ్ఞానేశ్వర్‌, జింక అశోక్‌, మహబూబ్‌, ఎర్రం గంగధర్‌, అంతరెడ్డి దేవి, కొండపాక రాజేష్‌, గోపరి లక్ష్మణ్‌, హరిబాబు, చింతకాయల రాజు, వెల్డింగ్‌ నారాయణ, అంబాదాస్‌, శ్రీను, పల్లికొండ అన్నయ్య, సీతారాం, మధుసుధన్‌, గంగాధర్‌, గరిపల్లి ప్రవీణ్‌, పవన్‌ పాల్గొన్నారు.

అర్బన్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌

అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా

నగరంలో ఎన్నికల ప్రచారం

వృద్ధురాలితో మాట్లాడుతున్న గణేశ్‌గుప్తా
1/1

వృద్ధురాలితో మాట్లాడుతున్న గణేశ్‌గుప్తా

Advertisement

తప్పక చదవండి

Advertisement