మోపాల్: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే రా ష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని కిసాన్ ఖేత్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో శనివారం ఆయ న కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి తరపున ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కరపత్రా లు పంపిణీ చేసి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. గంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, రూరల్లో భూపతిరెడ్డికి భారీ మెజార్టీ వస్తుందని తెలిపారు. నాయకులు ఎల్లోల సాయిరెడ్డి, లక్ష్మీనర్సయ్య, కృష్ణ ఉన్నారు.
సిరికొండ మండలంలో..
సిరికొండ: మండలంలోని గోప్యతండాలో శనివారం రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డికి మద్దతుగా పార్టీ సెల్ జిల్లా నాయకులు సంతోష్ నాయక్ ప్రచారం నిర్వహించారు. పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. నాయకులు జయరాంజాదవ్, మాజీ ఎంపీటీసీ రాంసింగ్, సంతోష్నాయక్, జీవన్, బలరాం, గజన్నాయక్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.