జక్రాన్పల్లి: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తా నని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని పుప్పాలపల్లి, గన్యతండా, మాదాపూర్, బాలానగర్, కేశ్పల్లి, పడకల్, కలిగోట్, చింతలూర్ గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాయకులు అప్పాల రాజన్న, అనంత్రెడ్డి, చిన్నారెడ్డి, నర్సారెడ్డి, నాయకులు వసంత్రావు, వినోద్, శ్రీధర్, చిన్నారెడ్డి, మనోజ్, గణేష్,సాయికుమార్, యంజీ గంగారెడ్డి, మునిపల్లి సర్పంచ్ సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి