రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి
డిచ్పల్లి: రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొరట్పల్లి, కొరట్పల్లి తండా, సుద్దులం, యానంపల్లి, సాంపల్లితండా, సాంపల్లి, లింగసముద్రం, మిట్టాపల్లి, మిట్టపల్లితండాలలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. అమరుల త్యాగాలకు చలించిపోయిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, అయితే పది సంవత్సరాలుగా తెలంగాణ ద్రోహుల చేతిలో రాష్ట్రం బందీగా మారిందన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బర్త్డే కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. కిసాన్కేత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేష్రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, నాయకులు పొలసాని శ్రీనివాస్, శ్యాంసన్, వాసు, ధర్మాగౌడ్, సురేందర్, సాయారెడ్డి, జహుర్, లక్ష్మణ్, రాఘవ, రమేష్, అనిల్, భూపాల్, గంగారెడ్డి, నర్సయ్య, గంగాదర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరిక
డిచ్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ షాదుల్లా సుమారు 50 మంది ముస్లిం కార్యకర్తలతో ఆదివారం భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
నిజామాబాద్ రూరల్: మండలంలొని సారంగాపూర్, రాంనగర్ గ్రామాల్లో సోమవారం కాంగ్రెస్ రూరల్ అభ్యర్థి భుపతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేస్తందని ధీమా వ్యక్తం చేశారు. రెండు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భూపతిరెడ్డికి సన్మనాలు, అప్యాయ పలకరింపులతో ప్రచారన్ని హోరేత్తించారు. రాంనగర్ గ్రామంలో 30 మంది మైనార్టీ మహిళలు కాంగ్రెస్లో చేరారు. నాయకులు రాజు, ఖలీముధ్దీన్, ఽతోఫిక్ , బాజీబాయి, సన్ని,ఉమ్మన్, హజి, రవి, అనిల్ కుమార్, రాంసింగ్, జావేద్ ఖాన్, నజీర్, సాయి, వెంకటేశ్వర్ తదిరులు పాల్గొన్నారు.