తొమ్మిదేళ్లు నగరాభివృద్ధికి కృషి చేశా | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్లు నగరాభివృద్ధికి కృషి చేశా

Published Wed, Nov 15 2023 1:04 AM

ముజాహిద్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహిస్తున్న బిగాల గణేశ్‌గుప్తా - Sakshi

నిజామాబాద్‌నాగారం: నగరం 60 ఏళ్ల వెనుక ఉంటే 9ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించామని బీఆర్‌ఎస్‌ అర్బన్‌ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా పేర్కొన్నారు. నగరంలోని ఖిల్లా రోడ్డు, హష్మీకాలనీ, ముజాహిద్‌నగర్‌లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షో నిర్వహించి, మాట్లాడారు. మైనారిటీల సంక్షేమంలో భాగంగా నగరంలో 8 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా విద్య అందిస్తున్నామన్నారు. నగరం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రెడ్కో మాజీ చైర్మన్‌ అలీం, మాజీ డిప్యూటీ మేయర్‌ మీర్‌ మాజాజ్‌ అలీ, నవీద్‌ ఇక్బల్‌, అబ్దుల్‌ ఖుద్దుస్‌, బబ్లూ ఖాన్‌, కరీముద్దీన్‌ కమల్‌, ఫయాజ్‌, అమర్‌, ఇంతియాజ్‌ పాల్గొన్నారు.

అర్బన్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి,

ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా

Advertisement
Advertisement