తాళం వేసిన ఇంట్లో చోరీ | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Published Tue, Nov 21 2023 1:14 AM

ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు  - Sakshi

కామారెడ్డి క్రైం: తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో పట్టపగలు చోరీ జరిగిన ఘటన కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్‌లో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీ కాలనీకి చెందిన ప్లాట్ల నరేష్‌ ఫుట్‌వేర్‌ నడిపిస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఉదయాన్నే ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లారు. మద్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తాళం పగులగొట్టి అతని ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు. సామాన్లన్నీ చిందరవందర చేసి బీరువాలోని 15 తులాల బంగారు ఆభరణాలు, రూ20 వేల నగదు ఓ బ్యాగులో వేసుకున్నాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన నరేష్‌ కొడుకు నవీన్‌ తాళం పగులగొట్టి ఉండటంతో లోపల ఎవరైనా ఉన్నారా అని గమనించాడు. దొంగ ఉన్నట్లు గుర్తించి పట్టుకోడానికి ప్రయత్నించాడు. నవీన్‌ రాకను గమనించిన దొంగ బ్యాగ్‌తో పాటు గోడ దూకి పరారయ్యాడు. పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. సీసీ ఫుటేజీలను, ఆధారాలను సేకరించారు. బాధితు డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌వో నరేష్‌ తెలిపారు.

Advertisement
Advertisement