కామారెడ్డి క్రైం: తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో పట్టపగలు చోరీ జరిగిన ఘటన కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్లో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీ కాలనీకి చెందిన ప్లాట్ల నరేష్ ఫుట్వేర్ నడిపిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఉదయాన్నే ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లారు. మద్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తాళం పగులగొట్టి అతని ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు. సామాన్లన్నీ చిందరవందర చేసి బీరువాలోని 15 తులాల బంగారు ఆభరణాలు, రూ20 వేల నగదు ఓ బ్యాగులో వేసుకున్నాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన నరేష్ కొడుకు నవీన్ తాళం పగులగొట్టి ఉండటంతో లోపల ఎవరైనా ఉన్నారా అని గమనించాడు. దొంగ ఉన్నట్లు గుర్తించి పట్టుకోడానికి ప్రయత్నించాడు. నవీన్ రాకను గమనించిన దొంగ బ్యాగ్తో పాటు గోడ దూకి పరారయ్యాడు. పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. సీసీ ఫుటేజీలను, ఆధారాలను సేకరించారు. బాధితు డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్వో నరేష్ తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
Published Tue, Nov 21 2023 1:14 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement