వేల్పూర్‌కి వస్తా చర్చకు సిద్ధమా.. | Sakshi
Sakshi News home page

వేల్పూర్‌కి వస్తా చర్చకు సిద్ధమా..

Published Wed, Nov 22 2023 1:22 AM

మాట్లాడుతున్న ప్రదీప్‌ ఈశ్వర్‌, ముత్యాల సునీల్‌రెడ్డి - Sakshi

మోర్తాడ్‌: కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మంత్రి ప్రశాంత్‌రెడ్డికి మహారాష్ట్రకు చెందిన చిక్బల్లాపూర్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌ సవాల్‌ విసిరారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు వేల్పూర్‌ చౌరస్తాకు వస్తానని అక్కడ చర్చకు సిద్ధంగా ఉండాలన్నారు. మోర్తాడ్‌లోని ప్రజానిలయంలో బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీల్‌రెడ్డితో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక పథకాలపై బీఆర్‌ఎస్‌ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకకు కారులో వెళదామా లేదా విమానంలో వెళదా మా తేల్చుకోవాలని ఖర్చంతా తనదేనని అన్నారు. అక్కడ ఏ ఊరికి వెళదామో మీరే నిర్ణయించి చెప్పాలని, ఒక వేళ అక్కడ తమ పథకాలు అమలవుతు న్నాయని తెలిస్తే ఇక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పా లని డిమాండ్‌ చేశారు. ఓడిపోతున్నామనే భయంతోనే మంత్రితో పాటు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కర్ణాటక పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

మంత్రికి కర్ణాటక ఎమ్మెల్యే

ప్రదీప్‌ ఈశ్వర్‌ సవాల్‌

నేడు వేల్పూర్‌ చౌరస్తాకు వస్తానని

స్పష్టీకరణ

Advertisement
Advertisement