బోధన్‌లో సీపీ పర్యటన | Sakshi
Sakshi News home page

బోధన్‌లో సీపీ పర్యటన

Published Fri, Dec 1 2023 2:52 AM

-

బోధన్‌టౌన్‌: బోధన్‌లోని పోలింగ్‌ బూత్‌ల ను గురువారం సీపీ కల్మేశ్వర్‌ పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో అనుమానాస్పదంగా కనిపించిన వారిని ప్రశ్నించారు. శక్కర్‌నగర్‌ కాలనీలో డబ్బులు పంచుతున్న వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తన ఓటు మరొకరు వేశారని వచ్చిన సంధ్యా అనే మహిళతో మాట్లాడారు. ఓటు ఎవరు వేశారో తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా సాగిందని ఆయన తెలిపారు. రెండు చోట్ల డబ్బులు పంచతున్న వారిని పట్టుకున్నామని వివరించారు. ఒకరి ఓటు మరొకరు వేశారని తమ దృష్టికి వచ్చిందని వెబ్‌ కెమెరాలను పరిశీలిస్తామని తెలిపారు.

Advertisement
Advertisement