ప్రజా సమస్యలపై పోరాడతా | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై పోరాడతా

Published Sun, Dec 17 2023 10:12 AM

నాయకులతో మాట్లాడుతున్న దినేష్‌ కులాచారి - Sakshi

సిరికొండ: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా తాను ప్రజల వెంటే ఉండి ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతానని బీజేపీ నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దినేష్‌ కులాచారి తెలిపారు. మండల కేంద్రంతో పాటు గడ్కోల్‌, హుస్సేన్‌నగర్‌, కొండూర్‌ గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. నాయకులతో వివిధ విషయాలపై ఆయన చర్చించారు. పార్టీ మండలాధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు రామస్వామి, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, లింబాద్రి, బాబురావు, గోపి, శ్రావణ్‌రెడ్డి, సంజీవ్‌, రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement