రెంజల్: పూడ్చిపెట్టిన మృతదేహానికి కొల్లూర్ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండలంలోని సాటాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గీరయ్య(48) బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లాడు. అక్కడ భవన నిర్మా ణ కార్మికుడిగా పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పనిచేస్తున్న ప్రదేశంలో భవనంపై నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనపై సైబరాబద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూర్ పీఎస్లో కేసు నమోదైంది. గాయపడిన గీరయ్యను కుటుంబీకులు గ్రామానికి తీసుకొచ్చి వైద్య చికిత్సలు అందించారు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ 15 రోజుల క్రితం మృతిచెందాడు. కుటుంబీకులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న కొల్లూర్ పోలీసులు శుక్రవారం గ్రామానికి చేరుకొని కేసు విషయమై పూడ్చిపెట్టిన మృతదేహానికి డాక్లర్లు, ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించారు.
Breadcrumb
- HOME
పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం
Published Sat, Apr 20 2024 1:15 AM
Advertisement
Related news
-
ఒకే కుటుంబం.. కేంద్రాలనేకం!
సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు.అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతో పాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలాఎందుకవుతుందో అంతుపట్టడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. నగరంలో వింత పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం! -
జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ
తాండూరు టౌన్: అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భయభ్రాంతులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాండూరు ఫైర్సేఫ్టీ ఆఫీసర్ నాగార్జున అన్నారు. అగ్నిప్రమాద నివారణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదం, షార్ట్సర్క్యూట్, సిలిండర్ పేలడం వంటివి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగులను ఎలా కాపాడాలో ప్రదర్శన ఇచ్చారు. ఎఫ్ఎస్ఓ మాట్లాడుతూ.. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయని, తాగిపడేసిన బీడీ, సిగరెట్, వంటగదిలో ఆఫ్ చేయని గ్యాస్ సిలిండర్ తదితర వాటి వలన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ కార్యాలయానికి సమాచారం అందజేయాలన్నారు. ఫైర్ సిబ్బంది, ఆస్పత్రి అధికారులు పాల్గొన్నారు. ఫైర్ డ్రిల్ నిర్వహించాలి అనంతగిరి: అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక అధికారి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అగ్నిమాపక పరికరాలను సరిచూసుకోవడానికి, అగ్ని ప్రమాదాలు జరిగినపుడు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రతి అంతస్తులో ఫైర్ వార్డెన్ను నియమించాలన్నారు. ఆస్పత్రిలో 3నెలలకు ఒకసారి ఫైర్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ప్రమాదం సమయంలో భయాందోళన చెందవద్దన్నారు. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫైర్సేఫ్టీ అధికారులునాగార్జున, వెంకటరమణారెడ్డి ఆస్పత్రుల్లో మాక్డ్రిల్ -
ఎన్నికలకు సై
నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ ● ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్ల దాఖలుకు సమాయత్తమైన అభ్యర్థులుసాక్షి, రంగారెడ్డిజిల్లా: సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లలో తలమునకలైంది. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై గట్టి నిఘా తదితర చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తుంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం మంచి ముహూర్తాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే పంతుళ్లను ఆశ్రయించి, ఏ రోజు నామినేషన్ వేయాలనే అంశంపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. శుభ ముహూర్తాలు ● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 24న బుధవారం చైత్ర బహుళ పాడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే.. అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు. ● 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం.. పై ముహుర్తాల కంటే ఇది యోగ్యమైనది. కానీ ఆరోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు సైతం బయటికి వెళ్లేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలో సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు ఇలా ● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎ ను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతి. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. ● అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు 3నెలలలోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటోను అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్పత్రంపై స్టాంప్ సైజు ఫొటో పెట్టాలి. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైతే విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ వీఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ●రిజస్టర్/గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్–3లో సి కాలం ఎదుట ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపరచాలి. ● పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ల స్వీకరణ కోసం రాజేంద్రనగర్ తహహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు, భద్రత కోసం చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీని ఎంపిక చేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో మొత్తం 29,28,186 మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు 13,443 పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల నిబంధనలు పాటించాలని.. అతిక్రమిస్తే చర్యలు తప్పవని అన్నారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయనున్న తేదీ బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 19 బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25 షెడ్యూల్ ఇలా.. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 6తో ఎన్నికల ప్రక్రియ ముగింపు. -
స్వశక్తితో ఆర్థికాభివృద్ధి సాధించాలి
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మర్పల్లి: ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన రంగంలో రాణించి ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడెం కృష్ణయాదవ్ గృహప్రవేశం కార్యక్రమం హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లడుతూ.. ప్రతిఒక్కరూ ఒక స్థితికి చేరుకున్న తర్వాత సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శ్రీనివాస్ యాదవ్ పేదరికం నుంచి స్వశక్తితో ఎదిగి నేడు సొంత ఇల్లునిర్మించుకోవడం అభినందనీయం అన్నారు. సహకార సంఘం చైర్మన్ ప్రవీణ్కుమార్, ఉపాధ్యక్షుడు ఫసీయుద్దీన్, కాంగ్రెస్ నాయకులు రాములు యాదవ్, రాచన్న, బలవంత్రెడ్డి, వెంకట్ తదితరులున్నారు. శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్రమంత్రి ● సతీసమేతంగా హాజరైన కిషన్రెడ్డి ● స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ కందుకూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్ రామాలయంలో బుధవారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్, కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, నాయకులు అమరేందర్రెడ్డి, నిరంజన్, భిక్షపతి, పాండు, రమేష్గౌడ్ తదితరులు ఉన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా విజయ్కుమార్ ఇబ్రహీంపట్నం రూరల్: బీజేపీ యువమోర్చా జిల్లా కార్యదర్శిగా మైలారం విజయకుమార్ నియమితులయ్యారు. బీజేవైఎం రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు యాదీష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రానికి చెందిన విజయ్కుమార్ బీజేపీలో చురుకై నపాత్ర పోషించారు. పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన అధిష్టానం కార్యదర్శిగా నియమించింది. ఆ పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు మెంబర్ సత్యనారాయణరెడ్డి చేవెళ్ల: ప్రజలకు ఇబ్బంది కలిగించే కాలుష్యకారకాలపై తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బోర్డు సెక్రటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన నగరంలో బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారని.. చేవెళ్ల ప్రాంతంలోని పలు సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాండూరులోని ఏసియన్ బ్రౌన్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో గ్రామస్తులు, విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని.. చందనవెల్లిలోని కుందన్ టైక్స్టైల్స్, శంషాబాద్ శ్రీకృష్ణ డ్రగ్స్తోనూ పర్యావరణం కాలుష్యమవుతోందని చెప్పానన్నారు. మోకిలలో నిర్మిస్తున్న విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణ వ్యర్థాలు గండిపేట చెరువులోకి వదులుతున్నారని ప్రస్తావించానన్నారు. మోకిలలోని నిర్మాణాలను సందర్శించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బోర్డు నిర్ణయించిందని చెప్పారు. మొదటిసారి సమావేశానికి హాజరైన నూతన మెంబర్లను బోర్డు ఆధ్వర్యంలో సన్మానించినట్లు వివరించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీబీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
యువతి అదృశ్యం
మొయినాబాద్: ఆరుబయట బాత్రూంకు వెళ్లిన వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం, రాఘవరెడ్డి కాలనీకి చెందిన అతిపాటి ఆదిశేషయ్య కొంత కాలంగా మండల పరిధిలోని చిన్నషాపూర్గేటు సమీపంలో ఉంటున్నాడు. అతని సోదరుడి కూతురు లావణ్య(18) పది రోజుల క్రితం ఆదిశేషయ్య ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం బాత్రూంకు వెళ్తానని ఇంటి నుంచి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మొయినాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా రాఘవరెడ్డి కాలనీకి చెందిన ప్రసాద్ అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి షాద్నగర్రూరల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కందివనం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన సిద్ధార్ధ తుకారాం కడేకర్(24) కుటుంబంతో కలిసి గత కొంత కాలం క్రితం షాద్నగర్కు వలస వచ్చారు. గ్రామంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో సిద్ధార్ధ వాచ్మెన్గా పని చేస్తున్నాడు. బుధవారం నీటి ట్యాంకులో ఆయన పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏఎస్ఐ రాంచందర్ ఘటనా స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. చేపలు పట్టే విషయంలో ఘర్షణ యాచారం: చెరువులో చేపలు పట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణచోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తక్కళ్లపల్లి–తక్కళ్లపల్లి తండా గ్రామాల మధ్యన ఉన్న చెన్నరెడ్డిచెరువులో మంగళవారం రాత్రి తండాకు చెందిన కొంత మంది చేపలు పట్టడానికి వెళ్లారు. ఇది గమనించిన తక్కళ్లపల్లి గ్రామస్తులు చేపలు పట్టే వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
Related News by category
-
స్వశక్తితో ఆర్థికాభివృద్ధి సాధించాలి
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మర్పల్లి: ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన రంగంలో రాణించి ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడెం కృష్ణయాదవ్ గృహప్రవేశం కార్యక్రమం హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లడుతూ.. ప్రతిఒక్కరూ ఒక స్థితికి చేరుకున్న తర్వాత సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శ్రీనివాస్ యాదవ్ పేదరికం నుంచి స్వశక్తితో ఎదిగి నేడు సొంత ఇల్లునిర్మించుకోవడం అభినందనీయం అన్నారు. సహకార సంఘం చైర్మన్ ప్రవీణ్కుమార్, ఉపాధ్యక్షుడు ఫసీయుద్దీన్, కాంగ్రెస్ నాయకులు రాములు యాదవ్, రాచన్న, బలవంత్రెడ్డి, వెంకట్ తదితరులున్నారు. శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్రమంత్రి ● సతీసమేతంగా హాజరైన కిషన్రెడ్డి ● స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ కందుకూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్ రామాలయంలో బుధవారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్, కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, నాయకులు అమరేందర్రెడ్డి, నిరంజన్, భిక్షపతి, పాండు, రమేష్గౌడ్ తదితరులు ఉన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా విజయ్కుమార్ ఇబ్రహీంపట్నం రూరల్: బీజేపీ యువమోర్చా జిల్లా కార్యదర్శిగా మైలారం విజయకుమార్ నియమితులయ్యారు. బీజేవైఎం రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు యాదీష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రానికి చెందిన విజయ్కుమార్ బీజేపీలో చురుకై నపాత్ర పోషించారు. పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన అధిష్టానం కార్యదర్శిగా నియమించింది. ఆ పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు మెంబర్ సత్యనారాయణరెడ్డి చేవెళ్ల: ప్రజలకు ఇబ్బంది కలిగించే కాలుష్యకారకాలపై తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బోర్డు సెక్రటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన నగరంలో బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారని.. చేవెళ్ల ప్రాంతంలోని పలు సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాండూరులోని ఏసియన్ బ్రౌన్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో గ్రామస్తులు, విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని.. చందనవెల్లిలోని కుందన్ టైక్స్టైల్స్, శంషాబాద్ శ్రీకృష్ణ డ్రగ్స్తోనూ పర్యావరణం కాలుష్యమవుతోందని చెప్పానన్నారు. మోకిలలో నిర్మిస్తున్న విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణ వ్యర్థాలు గండిపేట చెరువులోకి వదులుతున్నారని ప్రస్తావించానన్నారు. మోకిలలోని నిర్మాణాలను సందర్శించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బోర్డు నిర్ణయించిందని చెప్పారు. మొదటిసారి సమావేశానికి హాజరైన నూతన మెంబర్లను బోర్డు ఆధ్వర్యంలో సన్మానించినట్లు వివరించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీబీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు సై
నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ ● ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్ల దాఖలుకు సమాయత్తమైన అభ్యర్థులుసాక్షి, రంగారెడ్డిజిల్లా: సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లలో తలమునకలైంది. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై గట్టి నిఘా తదితర చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తుంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం మంచి ముహూర్తాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే పంతుళ్లను ఆశ్రయించి, ఏ రోజు నామినేషన్ వేయాలనే అంశంపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. శుభ ముహూర్తాలు ● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 24న బుధవారం చైత్ర బహుళ పాడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే.. అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు. ● 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం.. పై ముహుర్తాల కంటే ఇది యోగ్యమైనది. కానీ ఆరోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు సైతం బయటికి వెళ్లేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలో సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు ఇలా ● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎ ను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతి. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. ● అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు 3నెలలలోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటోను అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్పత్రంపై స్టాంప్ సైజు ఫొటో పెట్టాలి. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైతే విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ వీఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ●రిజస్టర్/గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్–3లో సి కాలం ఎదుట ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపరచాలి. ● పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ల స్వీకరణ కోసం రాజేంద్రనగర్ తహహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు, భద్రత కోసం చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీని ఎంపిక చేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో మొత్తం 29,28,186 మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు 13,443 పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల నిబంధనలు పాటించాలని.. అతిక్రమిస్తే చర్యలు తప్పవని అన్నారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయనున్న తేదీ బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 19 బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25 షెడ్యూల్ ఇలా.. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 6తో ఎన్నికల ప్రక్రియ ముగింపు. -
అటకెక్కికిన ‘బృహత్’
వికారాబాద్: బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు అటకెక్కినట్లు కన్పిస్తోంది. ఏడాది క్రితమే స్థలాల పరిశీలన పూర్తిచేసిన అధికారులు వాటి ఏర్పాటు కోసం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొన్నిచోట్ల పనులు ప్రారంభించినప్పటికీ అవి ముందుకు సాగడంలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో పట్టణ ప్రకృతి వనాలు, అర్బన్ పార్కుల పేరుతో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమానికి తోడు మండలానికొకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంవీటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఏడాది క్రితమే స్థలాల పరిశీలన పూర్తిచేసినప్పటికీ యంత్రాంగం వీటి ఏర్పాటుపై ఆసక్తి చూపడం లేదని సమాచారం. సమన్వయలోపం... బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థల పరిశీలన బాధ్యతలను రెవెన్యూ యంత్రాంగం చూడగా.. ప్రకృతి వనాల అభివృద్ధి బాధ్యతలు మండల పరిషత్, ఉపాధి హామీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏ మొక్కలు నాటాలి, ఎన్ని నాటాలి తదితర వాటిని ఫారెస్టు అధికారులు పర్యవేక్షిస్తారు. పచ్చదనాన్ని పెంచటంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా వనాల్లో కుర్చీలు, చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో మొదటి ఏడాది మొక్కలు నాటడం..వాటి పెంపకం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని, రెండవ ఏడాది నుంచి వనాలను అభివృద్ధి చేయటం, వాటిలో వసతులు కల్పించటం లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే శాఖల మధ్య సమన్వయలోపంతోనే ఇప్పటికీ పనులు ప్రారంభం కావడంలేదనే విమర్శలున్నాయి. మండలానికొకటి చొప్పున.. జిల్లాలో మండలానికొకటి చొప్పున మొత్తం 19 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థలాల లభ్యతను బట్టి మండల కేంద్రాలకు సమీపంలో లేదంటే మండలంలో ఏదో ఒకచోట ఈ వనాలకు స్థలాలను కేటాయిస్తారు. ఒక్కో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని 8 ఎకరాలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వనంలో సగటున 33వేల చొప్పున మొక్కలు నాటనున్నారు. కాగా ఇప్పటికే ప్రతి మున్సిపాలిటీకి ఒకటి చొప్పున జిల్లాలో నాలుగు అర్బన్ పార్కుల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అలాగే గ్రామానికొకటి చొప్పున జిల్లాలో మొత్తం 715 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలను కూడా త్వరగా ఏర్పాటు చేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో 19 బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రణాళిక ఏడాది క్రితమే స్థలాల కేటాయింపు పూర్తి శాఖల మధ్య సమన్వయ లోపంతో పనుల్లో తీవ్ర జాప్యం అందుబాటులోకి తేవాలంటున్న ప్రజలు పనులు ప్రారంభించాలి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థలాలు సేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలి. పల్లె ప్రకృతి వనాల తరహాలోనే బృహత్ ప్రకృతి వనాలు కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. – విజయ్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ -
ఒకే కుటుంబం.. కేంద్రాలనేకం!
సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు.అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతో పాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలాఎందుకవుతుందో అంతుపట్టడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. నగరంలో వింత పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం! -
జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ
తాండూరు టౌన్: అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భయభ్రాంతులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాండూరు ఫైర్సేఫ్టీ ఆఫీసర్ నాగార్జున అన్నారు. అగ్నిప్రమాద నివారణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదం, షార్ట్సర్క్యూట్, సిలిండర్ పేలడం వంటివి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగులను ఎలా కాపాడాలో ప్రదర్శన ఇచ్చారు. ఎఫ్ఎస్ఓ మాట్లాడుతూ.. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయని, తాగిపడేసిన బీడీ, సిగరెట్, వంటగదిలో ఆఫ్ చేయని గ్యాస్ సిలిండర్ తదితర వాటి వలన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ కార్యాలయానికి సమాచారం అందజేయాలన్నారు. ఫైర్ సిబ్బంది, ఆస్పత్రి అధికారులు పాల్గొన్నారు. ఫైర్ డ్రిల్ నిర్వహించాలి అనంతగిరి: అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక అధికారి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అగ్నిమాపక పరికరాలను సరిచూసుకోవడానికి, అగ్ని ప్రమాదాలు జరిగినపుడు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రతి అంతస్తులో ఫైర్ వార్డెన్ను నియమించాలన్నారు. ఆస్పత్రిలో 3నెలలకు ఒకసారి ఫైర్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ప్రమాదం సమయంలో భయాందోళన చెందవద్దన్నారు. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫైర్సేఫ్టీ అధికారులునాగార్జున, వెంకటరమణారెడ్డి ఆస్పత్రుల్లో మాక్డ్రిల్
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Shriya Saran: బ్లాక్ అవుట్ ఫిట్ లో శ్రియా పిక్స్ వైరల్ (ఫొటోలు)
'ది ఇండియన్ స్టోరీ' సినిమా రివ్యూ
ఆజానబాహుడిలా ఉండే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే!
నవీన్ పట్నాయక్ లక్ష్యం అదే.. వీకే పాండియన్
పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
అకాయ్ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్డే సెలబ్రేషన్స్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)
చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్
Betel Leaf: తమల పాకులతో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్!
‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Photos
View allVideo
View allతప్పక చదవండి
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
Advertisement