Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

Published Sat, Mar 18 2023 12:46 AM

-

పెనమలూరు: ఆటో ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు దుర్మరణం చెందిన ఘటన గంగూరు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగూరు గ్రామ పరిధి కరెంట్‌ ఆఫీసు వద్ద గుర్తు తెలియని వృద్ధుడు (65) గురువారం రాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా కంకిపాడు నుంచి విజయవాడ వైపు వస్తున్న ట్రక్‌ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు ఆక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వృద్ధుడు గళ్ల టీషర్టు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

పెడన: నందమూరు జయంతి కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు చనిపోయాడు. జోగి నాంచారయ్య అనే వ్యక్తి (60) ఒంటరిగా జీవిస్తున్నాడు. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని కారు వెనుక నుంచి ఢీ కొట్టి వెళ్లిపోయింది. ప్రభుత్వాసుపత్రికి తరలించే సమయంలో చనిపోయాడు. పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement