దుర్గమ్మకు విరాళంగా గాజులు | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు విరాళంగా గాజులు

Published Sun, Nov 12 2023 1:48 AM

ఛైర్మన్‌ రాంబాబుకు గాజులు అందిస్తున్న దృశ్యం  - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడకు చెందిన శ్రీ కనకదుర్గ లలితా పారాయణ బృందం దుర్గమ్మకు రూ. 2.70 లక్షల విలువైన గాజులను దేవస్థానానికి విరాళంగా అందజేసింది. 15వ తేదీన దుర్గమ్మకు గాజుల అలంకారం చేయనున్నారు. ఈ మేరకు శనివారం బృందానికి చెందిన సభ్యులు దేవస్థానానికి చేరుకుని సుమారు రూ. 2.50 లక్షల విలువైన గాజులతో పాటు అమ్మవారికి, ఉత్సవ మూర్తులకు అలంకరించేందుకు తయారు చేసిన రూ. 20 వేల విలువైన గాజుల ఆభరణాలు చైర్మన్‌ కర్నాటి రాంబాబును కలిసి అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారికి అలంకరణ నిమిత్తం దాతలు, ఉభయదాతలు, భక్తులు దేవస్థానానికి గాజులను విరాళాలుగా అందించాలని ఆలయ అధికారులు కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement