మహిళను కాపాడిన మైరెన్‌ పోలీసులు | Sakshi
Sakshi News home page

మహిళను కాపాడిన మైరెన్‌ పోలీసులు

Published Tue, Nov 14 2023 12:40 AM

-

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను మైరెన్‌ పోలీసులు కాపాడారు. గిలకలదిండికి చెందిన లంకే లక్ష్మి కుటుంబంలో నెలకొన్న గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైంది. గొడవలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని గిలకలదిండి మైరెన్‌ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్న జెట్టీ వద్ద నిలబడి ఒక్కసారిగా పాయలోకి దూకేసింది. మహిళను గమనించిన ఫిషింగ్‌ హార్బర్‌లో పనిచేస్తున్న కొంత మంది కూలీలు గట్టిగా కేకలు పెట్టటంతో విధుల్లో ఉన్న మైరెన్‌ కానిస్టేబుల్‌ లక్ష్మణరావు, హెడ్‌కానిస్టేబుల్‌ సాయికృష్ణ్ణ స్టేషన్‌ వద్ద నుంచి పరుగులు తీశారు. అప్పటికే నీటిలో మునిగిపోతున్న లక్ష్మిని కానిస్టేబుల్‌ లక్ష్మణరావు పాయలోకి దూకి పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. లక్ష్మిని కాపాడిన మైరెన్‌ పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement