వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రపై అవగాహన | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రపై అవగాహన

Published Thu, Nov 23 2023 1:40 AM

-

జూపూడి(ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్‌ జిల్లాలోని 288 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానునన్న వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర విజయవంతానికి జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి టీఎస్‌ జయచంద్ర గాంధీ అన్నారు. జూపూడిలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సంకల్ప యాత్రపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహణకు ప్రత్యేక పర్యవేక్షకులుగా డి.మోనాలిసా నియమితులైనట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలు, లబ్ధిదారుల గుర్తింపు, వారి అభిప్రాయాలను సేకరించాలన్నారు.

Advertisement
 
Advertisement