సీఐడీ కానిస్టేబుల్‌ సొమ్ము కాజేసిన సైబర్‌ నేరగాళ్లు | Sakshi
Sakshi News home page

సీఐడీ కానిస్టేబుల్‌ సొమ్ము కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

Published Fri, Dec 8 2023 1:38 AM

-

పెనమలూరు: సైబర్‌ నేరగాళ్లు సామాన్య ప్రజలనే కాకుండా పోలీసులను కూడా వదలడం లేదు. పెనమలూరు సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం సీఐడీ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఎం.సురేష్‌బాబుకు ఈనెల 4వ తేదీన ఎస్‌బీఐ రివార్డు పాయింట్స్‌ వచ్చాయని ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో సురేష్‌బాబు లింక్‌ను క్లిక్‌ చేసి పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేశారు. వెంటనే అతని బ్యాంకు ఖాతాలో తొలుత రూ.25 వేలు, ఆ తరువాత రూ.లక్ష కలిపి మొత్తం రూ.1.25 లక్షలు ఖాతాలో మాయమయ్యాయి. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అకౌంట్‌ బ్లాక్‌ చేసి కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement