Sakshi News home page

ఈడుపుగల్లు స్విమ్మర్ల ప్రతిభ

Published Tue, Dec 19 2023 1:06 AM

- - Sakshi

కంకిపాడు: సౌత్‌జోన్‌ అంతర్‌జిల్లాల స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఈడుపుగల్లు స్విమ్మర్లు సత్తా చాటారు. గ్రామానికి చెందిన బిళ్లా హర్షిత, బిళ్లా హర్షశ్రీ ఈ నెల 16, 17 తేదీల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన సౌత్‌జోన్‌ అంతర్‌జిల్లాల స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో రాణించారు. బెంగళూరులో జరగనున్న సౌత్‌జోన్‌ నేషనల్స్‌కు అర్హత సాధించారు. హర్షిత నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించారు. హర్షశ్రీ రజతం, రెండు కాంస్య పతకాలు పొందారు. క్రీడాకారులను డీఎస్‌డీఓ ఝాన్సీలక్ష్మి సోమవారం ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
Advertisement