వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కొత్త రైలు.. ఛార్జీలు ఎలా ఉన్నాయంటే? | Sakshi
Sakshi News home page

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కొత్త రైలు.. ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?

Published Fri, May 19 2023 12:55 PM

- - Sakshi

భువనేశ్వర్‌: పూరీ – హౌరా మధ్య ప్రారంభమైన 22895/22896 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆహారం చార్జీలతో పాటు టికెటు ధర నిర్ణయించారు. రైలులో ఆహారం అవసరం లేకుంటే మినహాయింపు కల్పించి టికెటు చార్జీలు కుదిస్తారు.

టికెటు బుక్‌ చేసుకునే సమయంలో ప్రయాణికుడు ప్రకటించిన నిర్ణయం మేరకు ఈ సౌకర్యం కల్పిస్తారు. నో ఫుడ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే, క్యాటరింగ్‌ ఛార్జీలు టికెటు ధర నుంచి నుంచి మినహాయిస్తారు. హౌరా నుంచి ఈ రైలు ఆగే పలు రైల్వేస్టేషన్ల వరకు ప్రయాణ చార్జీల వివరాలు ఇలా ఉన్నాయి. దీనిలో ఏసీ చైర్‌ కారు (సీసీ) కేటరింగ్‌ చార్జీ రూ.162లు, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కారు (ఈసీ) కేటరింగ్‌ చార్జీ రూ.195లుగా ఉంటాయి.

Advertisement
Advertisement