విద్యుత్‌ మీటర్‌ రీడర్‌ హత్య | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ మీటర్‌ రీడర్‌ హత్య

Published Tue, Aug 8 2023 2:08 AM

-

బరంపురం: గంజాం జిల్లాలోని గెలరి గ్రామంలో విద్యుత్‌ మీటర్‌ రీడర్‌ హత్యకు గురైన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఎస్పీ జగ్మాహన్‌ మినా తెలిపిన వివరాల మేరకు.. గెలరీ పోలీసుస్టేషన్‌ పరిధి కుడాలి ఆదివాసీ గ్రామంలో విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ కోసం వెళ్లిన సౌత్‌ కో ఉద్యోగి లక్ష్మీ నారాయణ త్రిపాఠి హత్యకి గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని బంజనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement